మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ దేశ ప్రజలకు ఆదర్శమని ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు అన్నారు. శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లావ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీలు నిర్వహించి శి వాజీకి జేజేలు పలికారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. పలు చోట్ల శివాజీ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజలు చేశారు. విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి పూజలు చేసి నివాళులర్పించారు. పేటలోని బసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివా జీ బాల్యం నుంచి ఎంతో క్రమశిక్షణగా ఎదిగారని, తల్లి జిజియాబాయి చిన్నతనం నుంచే రామాయణ, మహాభారత గాథలను తెలిపి వీర లక్షణాలను మొలకింపజేసిందన్నారు. పరమత సహనం, స్త్రీలపై గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నట్లు తెలియజేశారు. తల్లి సంరక్షణ, గురువుల మార్గదర్శనంలో శివాజీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని తెలియజేశారు. నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రతి పౌరు డు ముందుకు సాగుతూ దేశాన్ని కాపాడుకోవాలన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, , ఫిబ్రవరి 19