ఊట్కూర్, డిసెంబర్ 17 : సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపల్లిలో ఎమ్మెల్యే ని ధులు రూ.8 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శనివారం భూమి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీ సీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీల ఏర్పాటుతో గ్రామాలను ప్రగతి పథంలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న రా ష్ర్టాల్లో ఎక్కడ ఇలాంటి పథకాలు అమలు కాలేదన్నారు. సీ ఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పేద విద్యార్థులు ఉన్నత విద్య ను అభ్యసించేందుకు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత చ దువులు చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు సా ధించాలన్నారు. ఊట్కూర్లోని సర్వే నంబర్ 703 ప్రభు త్వ భూమి 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృ తి వనంలో మొక్కలు నాటారు. ప్రకృతి వనంలో మొక్కల కు నీటి సరఫరా కోసం బోరు, డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చే యాలని ఈజీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ నంలో ఆయిల్ ఫామ్ మొక్కలకు ప్రాధాన్యనివ్వాలని ఆ యన సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్క రూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచుల సంఘం జి ల్లా గౌరవాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఎంపీడీవో కాళప్ప, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, కార్యదర్శి సుమలత, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 17 : బీఆర్ అంబేద్కర్ విగ్రహా న్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు క మిటీ సభ్యులు శనివారం కలిసి చర్చించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మక్తల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని భారీస్థాయిలో ఏర్పాటు చేసేందుకు అన్ని రకా ల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే ప్రా రంభిస్తామన్నారు. విగ్రహ ఏర్పాటు విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరూ సమూహంగా ఏర్పడి ఏర్పాటులో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే నాయకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు మారెప్ప, కృష్ణ, నారాయణ, రాములు, శేఖర్, రవి, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.