పెంట్లవెల్లి, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాము లు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని సంగమేశ్వర ఆలయానికి చేరుకుంటుంటారు. అక్కడ ఆలయంలో పూజల అనంతరం కాలినడకన ముసలి మడుగు, ఆత్మకూరు మీదుగా శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు. అయితే రెండు నెలల కిందట తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మరబోట్ల య జమానుల మధ్య మనస్పర్థలు తలెత్తి ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఇరు రా ష్ర్టాల పోలీసులు కృష్ణానదిలో మరబోట్ల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ విషయం తెలియని స్వాములు మంగళవారం సాయంత్రం పాదయాత్ర చేపట్టి పెంట్లవెల్లి మం డలం మల్లేశ్వరం గ్రామ సమీపంలోని కృష్ణానది తీరానికి చేరుకున్నారు.
ఆ సమయం లో నదిలో మరబోట్లు నిషేధించామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. దీంతో చేసేది లేక స్వాములంతా రోజంతా నది ఒడ్డునే బస చేశారు. బుధవారం ఉదయం నుంచే తమను నది మరబోట్లల్లో నది దాటించి ఏపీలోకి వెళ్లేందుకు అనుమతినివ్వాలని ఏపీ పోలీసులను కోరారు. దీనికి వారు ససేమిరా అన్నారు. చేసేది లేక అక్కడే ఉండిపోయారు. స్వాములు చిక్కుకుపోయిన విషయాన్ని మల్లేశ్వరం సర్పంచ్ తిరుపాటి నాగరాజు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే బీరం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పం దించిన ఎమ్మెల్యే.. కర్నూల్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఇందుకు స్పందించిన ఎస్పీ, పోలీసులకు సమాచారం అందించడంతో వారు 50 మం ది శివస్వాములను రెండు మరబోట్ల సాయంతో సంగమేశ్వర ఆలయానికి సీఐ యాలాద్రి ఆధ్వర్యంలో క్షేమంగా చేర్చారు.