బీఆర్ఎస్ సర్కార్పై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి. పాలమూరులో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, గట్టులో ఎమ్మెల్సీ రవీందర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నారాయణ పేటలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు విఫల యత్నాలు చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి కేంద్రం దేశాన్ని దివాలా తీస్తున్నదని మండిపడ్డారు. కార్యకర్తల బాగోగులు తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు.
మహబూబ్నగర్ టౌన్, మార్చి 19: లౌకికవాదం, మ తసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. స్థానిక ఎస్ఎం ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ హనీఫ్ అహ్మద్ ఆధ్వర్యంలో సబ్బండవర్గాల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించా రు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ ము ఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. విభిన్న మతాలు, భాషలు, రాష్ర్టాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా, జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని హోం మంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో పాలమూరు జిల్లా దశ మారిందని.. మంత్రికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని సూ చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ విక్రయిస్తూ బీ జేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదని, దేశాన్ని దివాలా తీయిస్తున్నదని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు 15 రోజులకోసారి తాగునీరు వచ్చేదని గుర్తు చేశారు.
ప్రజలను కేవలం ఓ టు బ్యాంకుగా వాడుకొని పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. కులమతాల పేరిట కుట్ర రా జకీయాలు చేస్తూ పబ్బంగడుపుతారని, అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. మైనార్టీ అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. ఇమామ్, మౌజాన్లకు గౌ రవవేతనం అందజేస్తున్నామని, జిల్లాలో మినీ హజ్హౌ జ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీ పార్కులో కంపెనీ వస్తే కాలుష్యం పేరిట విషప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్వయం గా వెళ్లి పరిశీలించామని.. అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని మంత్రి తేల్చి చెప్పారు.
ప్రతిపక్షాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు మ హ్మద్హనీఫ్, ఇక్బాల్ ఆధ్వర్యంలో కార్మికనేత మిట్టె న ర్సింహ, ఖాదర్, సుమన్, గోపి సహా 100మంది మం త్రుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, మార్కెట్కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమా న్, హనీఫ్ అహ్మద్, వాహెద్తాజ్, మోసీన్ఖాన్, మహ్మ ద్ ఇక్బాల్, సమాద్ఖాన్, అంజద్, హఫీజ్ ఇద్రీస్, తఖీ, సుల్తాన్, రశాద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.