నాగర్కర్నూల్, మార్చి 28 : రక్తదా నం ప్రాణదానంతో సమానమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందించినట్లయితే వారికి ప్రాణాలు పోసినవారమవుతామని ఆయన అన్నారు. 30వ తేదీన శ్రీరామనవమి పండుగ రోజు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
రాష్ట్రంలో రక్త నిల్వల కొరత లే కుండా ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్టు ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదా న శిబిరాన్ని డీసీసీబీ డైరెక్టర్ జక్కా ర ఘునందన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మర్రి ప్రారంభించారు. మండలాల వారీగా వే ర్వేరుగా ఏర్పాటు చేసిన శిబిరంలో ని యోజకవర్గంలోని ప్రజలు, యువకు లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ తమ అభిమాన నా యకుడి పిలుపుతో ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువత, కార్యకర్తలు తరలివచ్చి 2,250 యూనిట్ల ర క్తాన్ని ఇచ్చారన్నారు.
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది 1,800 మందికిపైగా రక్తదానం చేయగా.. ఈసారి 2 వేలకుపైగా రక్తం యూనిట్లను ఇచ్చినుట్ల తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేయడానికి స హకరించిన ఇండియన్ రెడ్క్రాస్ సొసై టీ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేను డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సింగిల్విండో చైర్మ న్లు, కౌన్సిలర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.