కడ్తాల్, డిసెంబర్ 25 : మానవాళికి ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ చేసిన మహోపకారమే ‘శ్వాస మీద ధ్యాస’ అని, నిత్యం ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ నటుడు, గేయ రచయిత తనికెళ్ల భరణి అన్నారు. కడ్తాల్ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పిరమిడ్ స్పిరిచ్వల్ ట్రస్ట్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సుభాష్పత్రీజీ ధ్యాన మహాయాగం-2 ఐదో రోజుకి చేరుకున్నది. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మహాయాగానికి ధ్యాను లు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 5నుంచి 8గంటల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఆధ్యాత్మిక గురువులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రీ ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్కుమార్తో కలిసి తనికెళ్ల భరణి మాట్లాడుతూ ధ్యానానికి కుల, మత భేదం లేదని, ప్రతిఒక్కరూ ధ్యాన సాధన చేయవచ్చని చెప్పారు.
30 ఏండ్ల కిందట పత్రీ జీ నాటిన ధ్యాన విత్తనం ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా వట వృక్షంవలే విస్తరించిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన ‘నాలోన శివుడు గలడు’ అనే పాటను ఆలపించి ధ్యా నుల్ని రంజింపజేశారు. పీఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ మాట్లాడుతూ మనలోని సంకల్పానికి ధ్యా నం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పిరమిడ్ సభా వేదికపై క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పిరమిడ్ ప్రధాన వేదికపై జానపద పాటలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పత్రీజీ కు మార్తె పరిణీతపత్రీ, ట్రస్ట్ సభ్యులు బాలకృష్ణ, సాంబశివరావు, శ్రీరాంగోపాల్, రాం బాబు, హన్మంతురా జు, శివప్రసా ద్, దామోదర్రెడ్డి, మాధవి, లక్ష్మి తదితరులు ఉన్నారు.