నాగర్కర్నూల్, ఫిబ్రవరి 6: ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 12వ తేదీన నిర్వహించను న్న సామూహిక వివాహ వేడుకలకు ప్రజలు, మహిళలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సాయిగార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
వేడుక సందర్భంగా 10న జెడ్పీమైదానంలో మెహందీ కార్యక్రమం, పసుపుకొట్టే కార్యక్రమాలకు పెద్దఎత్తున మహిళలు హాజరుకావాలన్నారు. అనంతరం సామూహిక వివాహాలకు సంబంధించిన శుభలేఖ, సీడీని ఆవిష్కరించారు. సమావేశంలో ట్రస్టు డైరెక్టర్లు మర్రి జమున, జక్కా రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన పాల్గొన్నారు.
– ఎంజేఆర్ ట్రస్టు అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి