మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 30 : దేశంలో అత్యధికంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్న రా ష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌ డ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్లోని పిల్లి శంకరయ్య నివాసం సమీపంలో నిర్వహించిన కార్యక్రమం లో రిటైర్డ్ ఉద్యోగులు 100 మందికిపైగా మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చే రారు.
సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, కౌన్సిలర్ అనంతరెడ్డి, బీఆర్ఎస్ నేత పిల్లి సురేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యురాలు అనిత ఆధ్వర్యంలో రాఘవరెడ్డి, అచ్చిరెడ్డి, సిరాజుద్దీన్, అం జిరెడ్డి, చిన్నయ్య, వెంకటస్వామి యాద వ్, అయూబ్, చంద్రయ్యగౌడ్తోపాటు పలువురు చేరిన వారిలో ఉన్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నదన్నారు. నా డు అత్యంత వెనుకబడిన పాలమూరు ను నేడు రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబడేలా తీర్చిదిద్దామని చెప్పారు. ఉ మ్మడి పాలనలో 100 ఎకరాలు ఉన్న రైతులు కూడా వలస వెళ్లే వారని, కానీ నేడు గ్రామాల్లోనే పనులు లభిస్తున్నాయన్నారు. ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. త్వరలో వార్డు పర్యటనలు చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎంవీఎస్ కళాశాల నుంచి మర్లు మీదుగా మెట్టుగ డ్డ వరకు ఇండ్లకు ఎలాంటి ఇబ్బంది లే కుండా రోడ్డు విస్తరణ చేయనున్నట్లు వె ల్లడించారు. కార్యక్రమంలో హన్వాడ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నా యకుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.