జడ్చర్ల, డిసెంబర్ 21 : పత్తి ధరలు రోజురోజుకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది రూ.10వేలకు పైగా పలికిన పత్తి ధరలు ఈ ఏడాది పూర్తిగా భిన్నంగా తక్కువ ధరలు వస్తుండటం తో పెట్టిన పెట్టుబడికూడా రాని పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల పత్తి మార్కెట్ లో బుధవారం పత్తికి అత్యధికంగా క్వింటాకు రూ.8,050 ధర పలికింది. శనివారం క్వింటా రూ.8,199ధర రాగా బుధవారం రూ.8,050ధర పలికింది. మొదట్లో ధర లు బాగానే ఉన్నా ప్రస్తుతం మాత్రం పత్తి ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యానికి బుధవారం అత్యధికంగా క్వింటాకు రూ.2,492ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు పత్తి, ధాన్యం, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, అమ్మకాని వచ్చాయి.
మార్కెట్కు 588 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.8,050ధర రాగా కనిష్ఠంగా రూ.5,679 మధ్యస్తంగా రూ.7,849ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 1,127 క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,492 ధర రాగా కనిష్ఠంగా రూ.1,708 మధ్యస్తంగా రూ.2,367ధర పలికింది. అదే విధంగా 386 క్వింటాళ్ల హంస రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.1,939ధర రాగా కనిష్ఠంగా రూ.1,669 మధ్యస్తంగా రూ.1,869 ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 217క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,261ధర పలుకగా కనిష్ఠంగా రూ.1,810 మధ్యస్తంగా రూ.2,261ధర వచ్చింది. అదేవిధంగా మార్కెట్కు 22క్వింటాళ్ల సోన రకం ధాన్యం అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,065ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 12క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.6,889ధర పలికింది. అదేవిధంగా మార్కెట్కు 11క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.6,230 ధర పలికింది.
రూ.2,452 ధర పలికిన సోనా
నారాయణపేట టౌన్, డిసెంబర్ 21 : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం 471 క్వింటా ళ్ల ధాన్యం విక్రయాలు జరిగాయి. ఇందులో 74 క్వింటాళ్ల హంసరకం ధాన్యం విక్రయానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,390, కనిష్ఠంగా 1,966 ధర పలికింది. అలాగే 397 క్వింటాళ్ల సోనారకం ధాన్యం విక్రయానికి రాగా క్విం టాకు గరిష్ఠంగా రూ.2,457, కనిష్ఠంగా రూ.1,609 ధర పలికింది. అలాగే 1,136 క్వింటాళ్ల ఎర్ర కందులు విక్రయానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.8,269, కనిష్ఠంగా రూ.5,255 ధర పలుకగా, 287 క్వింటాళ్ల తెల్లకందులు క్వింటాకు గరిష్ఠంగా రూ.8,422, కనిష్ఠంగా రూ.7,670 ధర పలికినట్లు కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.