మహబూబ్నగర్ జనవరి 23: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీ, దడవాయి కార్మిక సంఘం, మహర్షి వాల్మీకి సంఘం, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీసీ మేధావుల సంఘం, జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, ఆరెకటిక సంఘం, తెలంగాణ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయ మార్కెట్లకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కార్మికులకు హమాలీ రేటును రూ.2 నుంచి రూ.4.50లకు పెంచామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మార్కెట్లో త్వరలో రూ.5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అన్ని విధాలా వారి వెన్నంటే ఉంటామని చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని వివరించారు. సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో అందుతున్నాయని చెప్పారు. ఎప్పుడైనా ఎవరికైనా ఆపద వస్తే అందుబాటులో ఉంటామని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. అనంతరం మంత్రిని గజమాలతో సన్మానించారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, శాంతన్యాదవ్, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, గోవింద్, మోసిన్, దడవాయి సంఘం నేతలు వెంకట్రాములు, బీసీ మేధావుల సంఘం జిల్లాకార్యనిర్వాహక అధ్యక్షుడు రమేశ్ సరోడే, జిల్లా అధ్యక్షుడు పాండురంగం, ఉపాధ్యక్షుడు కోదండపాణి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, బాబులాల్, పాండురంగం, వెంకటేశ్, నవీన్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, మాధవి, వెంకట్రెడ్డి, ఆరె కటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందులాల్, ప్రధాన కార్యదర్శి మోహన్లాల్, తెలంగాణ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్మోహన్, ప్రధాన కార్యదర్శి ముస్తాక్, మహర్షి వాల్మీకి సంఘం నాయకులు కృష్ణయ్య, రవికుమార్, వెంకట్రాములు, కృష్ణయ్య, సంతోష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.