కోస్గి, డిసెంబర్ 18 : వరుస చోరీలతో కోస్గి ప్రజలు బి క్కుబిక్కుమంటున్నారు. ఈనెల 14న పట్టణంలోని ఓ హార్డ్వేర్ షాపులో రూ.లక్ష చోరీ జరిగిన ఉదాంతం మరవకముందే 16న బిజ్జారంలో మరో చోరీ జరిగింది. ఇలా వరుసగా చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా ఆదివారం వారాంతపు సంతలో సెల్ఫోన్ జేబు దొంగలు హల్చల్చేస్తున్నారు. పట్టణంలో ఇంత జరుగుతున్న అధికారులు ని మ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిఅలా ఉండ గా ప్రతి ఆదివారం వారాంతపు సంతలో సెల్ఫోన్ల చోరీల కేసుల ఫిర్యాదులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చి కట్టడి చేయాల్సిన పోలీసులు పరిశీలన మరిచి ఫిర్యాదు లు తీసుకొని తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం సంతలో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించడం లేదు. ఇప్పటికీ పదుల సంఖ్యలో సెల్ఫోన్లు, ప్యాకెట్ చో రీల ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసిన ఫలితం లేదు
సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసి ఏడాది గడిచింది. ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. చోరీలపై పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసులు ఆదివారం సంతలో నిఘా ఉంచితే బాగుంటుంది.
– వెంకట్రెడ్డి, కోస్గి