పాలమూరు, నవంబర్ 29 : విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారంతో ముగిశాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్లో రెండ్రోజులపాటు జరిగిన సైన్స్ఫెయిర్కు విశేష స్పందన లభించింది. 210 పాఠశాలల నుంచి 426 ప్రదర్శనలు వచ్చాయి. విద్యాశాఖ నుంచి కూడా ఆలోచనలకు పదునుపెట్టి ప్రదర్శనలు ఏ ర్పాటు చేశారు. కరోనా తరువాత తొలిసారిగా ప్రత్యక్ష పద్ధతి లో జరిగిన సైన్స్ఫెయిర్కు అనుకున్న స్థాయికి మించి ప్రదర్శనలు వచ్చినట్లు డీఈవో రవీందర్ తెలిపారు. ఇసుక రవాణా అరికట్టడం, సురక్షిత సెన్సార్ హెల్మెట్, రిమోట్ కంట్రోల్ పే షెంట్, భూకంపాలను గుర్తించి భవనాలను కాపాడడం వంటి వినూత్న ప్రయోగాలు ప్రదర్శించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్ర దర్శనలను రాష్ట్ర స్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో శ్రీనివాసులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మట్టిలో మణిక్యాలను గుర్తించాలి..
మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చే రుకుంటారని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి తెలిపారు. సైన్స్ఫెయిర్ ప్రదర్శన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడతారని, వారు దండించినా మీ మంచికేనని విద్యార్థులు గుర్తించాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించి తల్లిదండ్రులను మంచి పేరు తీసుకురావాలన్నారు.