ధరూరు, నవంబర్ 27: విద్యాదాతలను భవిష్యత్ తరాల జ్ఞానదాతలుగా సమాజం భావించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల స్థల దాతలైన గాండ్ల రామలింగప్ప, డీఆర్ వీరప్పల విగ్రహాలను ఎమ్మెల్యే అదివారం ఉదయం అవిష్కరించారు. స్థలదాతల వారసులు మాజీ ఎంపీటీసీ డీఆర్ శ్రీధర్మంజుల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్కుమార్శివలీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పాఠశాలలో విగ్రహాలను అవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గాండ్ల వంశం పాఠశాలకు స్థలం బహూకరించి గ్రామంలో, మండలంలో విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపారన్నారు.
ఎంతోమంది విద్యార్థులను ఉద్యోగాలు, రాజకీయాలు, పారిశ్రామిక రంగం లో రాణించేలా ఈ పాఠశాల తీర్చిదిద్దిందన్నారు. అటువంటి సాధికారతకు మూలపురుషులైన గాండ్లవారి రుణం ఎప్పటికైనా ఈ గ్రామం, మండలం తీర్చలేనిదని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, అందుకు వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలను మరువకూడదని తోచినంత సహకారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీ సీ పద్మావెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీలు శివలీల, దౌలన్న, సర్పంచ్ పద్మమ్మ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, జాకీర్, సుధాకర్రెడ్డి, రాజారెడ్డి, వెంకటేశ్నాయు డు, అబ్రహం, శ్రీను, జేడీ సత్యం, రాములు, దేవన్న, నాగరాజు, లాజర్, తిమ్మప్ప, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్, ఉపాధ్యక్షుడు జాంపల్లె భరతసింహారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి స్పష్టంచేశారు. మండలంలోని ఉలిగేపల్లిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సమైకాంధ్ర ప్రభుత్వాలు వైద్యరంగాన్ని అసలు పట్టించకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సొంత టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని కొనియాడారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీశ్రావు బాధ్యతలు చేపట్టిన తరువాత పరిస్థితే మారిపోయిందని కితాబిచ్చారు. గతంలో ప్రభుత్వ వైద్యం అంటే భయపడేవారని, ఇప్పుడు అది మారిపోయిందన్నారు. ప్రభుత్వ వైద్యంతో ప్రైవేట్ దవాఖానల్లో రోగులకు జాగా కరువయ్యిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందనున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ్ల గ్రంథాలయ సంస్థ జిలా చైర్మన్ జంబు రామన్గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీలు ప్రభాకర్రెడ్డి, రాజశేఖర్, పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీలు వీరన్న, సుదర్శన్రెడ్డి, సర్పంచ్ చిన్నరాములు, ఎంపీటీసీలు పెద్ద సవారన్న, గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటన్న, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.