గద్వాల అర్బన్, సెప్టెంబర్ 16: కిరాయి గుం డాలతో దాడి చేయిం చి చంపేందుకు కుట్ర చేశారని రాష్ట్ర గిడ్డంగు ల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్నారు. శుక్రవారం అలంపూర్ లో నిర్వహించిన తె లంగాణ జాతీయ స మైక్యతా వజ్రోత్సవాలకు సాయిచంద్ హాజరయ్యారు. కార్యక్రమం ముగింపు సమయంలో సాయిచంద్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఘర్షణలో సాయిచంద్కు గాయాలు కావడంతో ఆయన అనుచరులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. అనంతరం సాయిచంద్ విలేకర్లతో మాట్లాడారు.
అలంపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పాల్గొని సభలో మాట్లాడిన తర్వాత కిందికొచ్చే సమయంలో ఎమ్మెల్యే తనయుడు కిరాయి గుండాలతో దాడి చేయించారన్నారు. దాడిలో తనకు, గన్మెన్లకు, పీఏకు గాయాలైనట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేకు, తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. కానీ, తనపై దాడి చేసేంత తప్పు ఏం చేశానో వారు చెప్పాలని ఈ సందర్భంగా సాయిచంద్ ప్రశ్నించారు. ఘర్షణలో తనపై దాడి చేసిన వారు, చేయించిన వారిపై కేసు నమోదు చేయాలని జిల్లా పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.