నాగర్కర్నూల్, జూలై 3: విద్యార్థుల్లో వైజ్ఞానిక అంశాలపై ఆసక్తిని పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్స్పైర్ మనక్ అవార్డులకోసం దరఖాస్తు చేసుకొ నేందుకు జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు గుజరాత్లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ, కేంద్ర సాంకేతిక శాఖలు విశేషంగా చేస్తున్న కృషిలో ఇన్స్పైర్ మనక్ అవార్డులు గ్రామీణ విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్ను ఇన్స్పైర్ అవార్డుల పథకాలని జిల్లా నుంచి వివిధ యాజమాన్యాల పాఠశాలలు దరఖాస్తులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం అవలంబి స్తున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. గతేడాది జిల్లాలో 640 పరిశోధనలు ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేయగా అందులో 600 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉండగా 40 ప్రదర్శనలు ప్రైవేట్ పాఠశాలల నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమైన ఇన్స్పైర్ దరఖాస్తుల ప్రక్రియపై జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది జిల్లా నుంచి దరఖాస్తు చేసిన పాఠశాలల నుంచి 70 పరిశోధనా అంశాలు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కావడం వారందరికీ నూతన ఆవిష్కరణల కోసం రూ.10 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎంపికైన 70ఇన్స్ప్పైర్ ప్రదర్శనలు సెప్టెంబర్ మాసంలో తమ ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు.
2022-23 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డులకు విద్యార్థులు నామినేషన్లను పంపాలని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులకు డీఈవో అధికారి జూలై 1న స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ, ప్రాజెక్టుల ఎంపికలో మెళకువలు, తయారీలో నైపుణ్యాలు పెంచే విధంగా అధిక సంఖ్యలో నాణ్యమైన ప్రాజెక్టులకు రూపొందించేందుకు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలను వెబ్నార్ల ద్వారా నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి తెలిపారు.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థికి ప్రాజెక్టు రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు చెల్లించడమే గాక జాతీయస్థాయిలో విద్యార్థుల ప్రతిభ నైపు ణ్యాల ను గుర్తించేందుకు మంచి అవకాశం ఉన్నప్పటికీ జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్ అవార్డులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ పరిణామాలపై జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్స్పైర్ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల నుంచి 2 నుంచి 5 ప్రాజెక్టులు నమోదు చేయాలని, డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సందేశాలు, సమస్యలు ఉత్పన్నమై తే జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డిని 9989921 105 నెంబర్లో సంప్రదించాలని సూచించారు
ఇన్స్పైర్ మనక్ అవార్డులకు రిజిస్ట్రేషన్ తొలుత వెబ్సైట్లోకి వెళ్లి స్కూల్ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం వెబ్సైట్లో పాఠశాల యూడైస్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్థుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుడి పేరు సెల్నెంబర్, పాఠశాల ఇన్స్పైర్ ఇన్చార్జి ఉపాధ్యాయుడి పేరు, సెల్ నెంబర్, పాఠశాల చిరునామా తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
5 నిమిషాల తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు నేరుగా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఇద్దరు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థుల పేర్లు, వారి తండ్రి పేర్లు, పుట్టినతేదీ, ఆధార్నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్లు, విద్యార్థులు చేసే ప్రాజెక్టుల సమాచారాలు నమో దు చేయాల్సి ఉంటుంది. 2022-23 విద్యా సంవత్సరంలో వార్డులకు దరఖాస్తు చేయడానికి 2022 సెప్టెంబర్ 30 తుది గడువుగా కేంద్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు ఐడియాలపై కాంపిటీషన్లు పెట్టి అందులో నుంచి సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ఎంపిక చేసి వెబ్సైట్లో నమోదు చేయాలి. విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇన్స్స్పైర్ మానక్ ఒక సువర్ణ అవకాశం.
విద్యార్థుల ఆలోచనలు ఆవైపుగా వెళ్లేలా అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలి. సృజనాత్మకత నిండిన ఆలోచన పిల్లల్లో నింపాలి. పరిశీలన శక్తి పెంచి, గమనించే శక్తి పెరిగే విధంగా వారికి ఉపాధ్యాయులు ప్రశ్నలు వేయాలి.
-కృష్ణారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి
ప్రతి పాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థుల చుట్టూ ఉండే భౌతిక వాస్తవికతలను పరిగణలోకి తీసుకొని, శాస్త్రీయ దృక్పథం జీవన విధానం, ఆలోచనలను ప్రతిబింబించేలా ప్రదర్శనలను రూపకల్పన చేసి తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహంతోపాటు విద్యార్థుల అకౌంట్లలో రూ.10 వేలు జమ, విద్యార్థి రూపొందించిన ప్రదర్శన జాతీయస్థాయికి ఎంపిక అయితే అదనంగా మరో రూ.25 వేలు విద్యార్థికి అందుతాయి. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు గడువులోగా నమోదు చేయాలి. నమోదు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
-గోవిందరాజులు, డీఈవో