భూత్పూర్, మే 12: టీఆర్ఎస్ హయాంలో తండాలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 65ఏండ్లలో తండాలు కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బందుల పాలైనట్లు గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి తండాకూ బీటీ సౌకర్యం కల్పించాలని మంత్రి కేటీఆర్ను కోరిన వెంటనే భూత్పూర్ మున్సిపాలిటీకి రూ.12కోట్ల 52లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. తండాల బీటీ రోడ్ల నిర్మాణాలకు అధికారులు సమాయత్తం కావాలని కోరారు. అంతేకాకుండా నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇండ్లు కొత్తగా 1100మంజూరైనట్లు తెలిపారు.
అనంతరం మండలంలోని భట్టుపల్లి గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన గడ్డం వసంత, సబావట్ మణి కుటుంబాలకు ఎమ్మెల్యే రైతుబీమా చెక్కులను అందజేశారు. అనంతరం 65శాతం సబ్సిడీతో జీలుగ విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, సర్పంచ్ ఆంజనేయులు, ఏఈవోలు హర్షవర్ధన్, శంకర్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, అశోక్గౌడ్, గడ్డంరాములు, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్కుమార్, మాధవరెడ్డి, రామురాథోడ్, మహమూద్, గోపాల్ పాల్గొన్నారు.