గద్వాల, జనవరి 4 : గట్టు మండలం మాచర్ల లో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 5 నుంచి 10 వర కు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సర్పంచ్తోపాటు ఆ లయ కమిటీ నిర్వాహకులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధిరామప్ప, వైస్ ఎంపీపీ రామకృష్ణ, నాయకులు ఆ నంద్, శేఖర్రెడ్డి, పవన్రెడ్డి తదితరులున్నారు.