తిమ్మాజిపేట, జనవరి 14 : మండలంలోని అప్పాజిపల్లి నర్సన్నగుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి క ల్యాణం కమనీయంగా జరిగింది. శనివారం అందంగా అలంకరించిన మండపంలో కొలువైన స్వామివారి క ల్యాణ మహోత్సవాన్ని పండితులు వేదమంత్రోచ్ఛరణ ల మధ్య నిర్వహించారు. వేదపండితులు కృష్ణమూర్తి, రాఘవేందరశర్మ, హరి ఆద్యంతం సంప్రదాయబద్ధం గా వేడుక జరిపించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కల్యాణం తిలకించి తన్మయత్వం చెందారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహస్వామి నామస్మరణ మార్మోగింది. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జమున దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కల్యాణంలో పాల్గొన్నారు. పలువురు మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగా.. వందల సంఖ్యలో జంటలు పాల్గొన్నాయి. భక్తులకు ప్రసాద వితరణ చేశామని పండితులు గంగాధర శర్మ తెలిపారు.
నర్సన్నగుట్టపై హైదరాబాద్కు చెందిన దాత శ్రీనివాసరెడ్డి, మంజుల దంపతులు అందించిన విరాళంతో నిర్మించనున్న మెట్ల పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో పనులు చేపట్టారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, సర్పంచ్ తిరుపతమ్మ, తిమ్మాజిపేట సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, కోడుపర్తి సర్పంచ్ ఉమాదేవి, దేవాలయ కమిటీ చైర్మన్ నర్సింహారావు, అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, కార్యదర్శి రాంచంద్రారెడ్డి, రాందేవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాలస్వామి, భాస్కర్రెడ్డి, సురేందర్రెడ్డి, శేఖర్రెడ్డి, రమేశ్, వెంకటయ్య, ఎల్లారెడ్డి, సుం దరయ్య, శేఖర్, మహిపాల్, పాపయ్య పాల్గొన్నారు.
తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో గోదాదేవి కల్యాణం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ మ ధ్య వేడుక నిర్వహించారు. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్వేత దంపతులు కల్యాణోత్సవంలో పా ల్గొన్నారు. అంతకుముందు వారికి పూర్ణకుంభంతో ఆలయ కమిటీ, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, సర్పంచ్ అజయ్, విండో డైరెక్టర్ నరేందర్రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.