గద్వాలటౌన్, ఫిబ్రవరి 25 : గద్వాల కోటలో వెలిసి న భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మా ఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొ ని శనివారం రాత్రి మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని వేలాదిమం ది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అడుగడుగునా గోవింద నామస్మరణ మార్మోగింది. వేడుకను తిలకించేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు.
ఆలయ అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ ఎంతో సహకరించిందని, నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తుందన్న నమ్మ కం ఉందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థ శ్రీపాదుల తెలిపారు. చారిత్రాత్మకమైన రథశాలతోపాటు వివిధ కట్టడాలను త్వరలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా షేరెల్లివీధిలోని రాఘవేంద్రస్వామి మఠం నుంచి కోటలోని ఆలయం వరకు ప్ర హ్లాద రాయల ఉత్సవమూర్తులను ఊరేగించా రు. గురు విజయ విఠల బృందం ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. ఆదివారం స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు.