జడ్చర్ల, ఫిబ్రవరి 3 : రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని, అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రణదాతలుగా నిలువాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత, కుమారుడు స్వరణ్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్రెడ్డి, వియ్యంకుడు టంగుటూరి రాకేశ్రెడ్డితోపాటు 993మంది రక్తదానం చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కాగా జడ్చర్ల మండలంతోపాటు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి స్టేజీ వద్ద బీఆర్ఎస్ యూత్వింగ్, సర్పంచ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జడ్చర్ల ఫ్లైఓవర్బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఫ్లైఓవర్బ్రిడ్జి నుంచి సిగ్నల్గడ్డవరకు పటాకులు కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెటిరో ఫార్మా సహకారంతో 10మంది దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మ న్ ఇంతియాజ్ ఇసాక్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నేతాజీచౌరస్తాలో మున్సిపల్ వైస్చైర్పర్సన్ సారికారామ్మోహన్ ఆధ్వర్యంలో ధూంధాం నిర్వహించారు.
నవాబ్పేట, ఫిబ్రవరి 3 : మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. నవాబ్పేట, రుద్రారం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. జంగమయ్యపల్లి పాఠశాలలో సర్పంచ్ వెంకటేశ్ విద్యార్థులకు నోట్పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమో ని నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందర్నాయక్, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం, యాద య్య, వెంకటేశ్, సురేందర్, నర్సింహానాయక్, ఎంపీటీసీలు గోపాల్, గోపీకృష్ణ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, అబ్దుల్లా, శంకర్నాయక్, నవనీతరావు, మెండె శ్రీను, రఘు, పాశం కృష్ణ య్య తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 3 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, జెడ్పీటీసీ కల్యాణీలక్ష్మణ్నాయక్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలకేంద్రంలో వైస్ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, యూత్వింగ్ అధ్యక్షు డు సుప్ప ప్రకాశ్, ఎస్టీసెల్ ఉపాధ్యక్షుడు రమేశ్నాయక్, సింగిల్విండో డైరెక్టర్ మంజూనాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రజినీజగన్నాయక్ పాల్గొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 3 : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మధ్య ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 3 : మండలకేంద్రంలో ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, పీఏసీసీఎస్ చై ర్మన్ శ్రీనివాస్రెడ్డి, సుధాబాల్రెడ్డి, బాలు, భాస్క ర్, జంగారెడ్డి, వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి, దానియేలు, బుచ్చయ్య, భద్రయ్య, శ్రీనివాసులు, ఆచా రి, జగన్గౌడ్, రామకృష్ణ, విజయ్ పాల్గొన్నారు.