మద్దూర్(కొత్తపల్లి), ఏప్రిల్ 10 : అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న హోంగార్డుపై ఎస్ఆర్వో దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన ఘటన మండలంలోని దోరేపల్లిలో చోటు చేసుకున్నది. బుధవారం లింగల్చేడ్ వాగులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్వో ఆంజనేయులు తన స్వగ్రామమైన దోరేపల్లిలో అధికారుల అండదండలతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. అటుగా వెళ్తున్న హోంగార్డు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకొన్నా డు. దీంతో ఎస్ఆర్వో ఇసుక ట్రాక్టర్ అడ్డుకోవడానికి నీవెవరంటూ ప్రశ్నించడమే కాకుండా హోంగార్డు కాలర్ పట్టుకొని దౌర్జన్యం చేసి అతడి చేతిలో ఉన్న మొబైల్ను పగులగొట్టాడు. అంతేకాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే రీతిలో వ్యవహరించి ట్రాక్టర్ను అ క్కడి నుంచి తప్పించాడు.