కోస్గి, డిసెంబర్ 11 : కోస్గి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కోస్గి మార్కెట్ యార్డు పరిధిలో కోస్గితోపా టు మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మార్కెట్ ఉన్నాయి. కోస్గి మార్కెట్కు రూ.లక్షల ఆదాయం ఉండేది. పక్క మార్కెట్లకు ఈ మార్కెట్ నిధులు అ ప్పుగా ఇచ్చేది. కోస్గి వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు కాంప్లెక్స్ నిర్మించాలని పాలకవర్గ సభ్యులు కోరడంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్రె డ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.94లక్షలు మంజూరు చేయించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చే స్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
త్వ రలో రూ.80లక్షలతో మహబూబ్నగర్ తాండూ ర్ ప్రధాన రహదారి పక్కన మార్కెట్ యార్డులో కాంప్లెక్స్ నిర్మాణం, మరో రూ.14లక్షలతో ప్రహ రీ నిర్మాణం చేపట్టనున్నారు. కొంతకాలంగా మా ర్కెట్ యార్డు స్థలం ఆక్రమణకు గురవుతున్నదన్న నేపథ్యంలో ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నారు. ఎంతో కాలంగా కోస్గి మార్కెట్ యార్డుకు దుకాణాల నిర్మాణం జరగాలని వ్యాపారులు కోరడం, మార్కెట్ సముదాయంలోనే వ్యాపారాలు కొనసాగించాలన్న కల ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ వీరారెడ్డి, వైస్చైర్మన్ వరప్రసాద్ పాలక మండలి హయాంలో సాకారం కానుంది. దీంతో మార్కెట్ వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.