జెడ్పీ చైర్ పర్సన్ సరిత
అయిజ, ఫిబ్రవరి 8: రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలంలోని టీటీదొడ్డిలోని గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన బండలాగుడు పోటీలను మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు గుండ్ల భీమరాయుడిని జెడ్పీ చైర్పర్సన్ దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మెమోంటో అందజేసి సత్కరించారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. గ్రామీణ సంప్రదాయాలు, క్రీడలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీటీదొడ్డిలో గుండ్ల భీమరాయుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పశుబల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .. నడిగడ్డలో పశుబల ప్రదన్శన పోటీలు నిర్వహణ సర్వసాధారణమన్నారు. అంతకుముందు గుండ్ల భీమరాయుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్ హుస్సేని, టీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య, వెంకట్రాములు, శివకుమార్, ఉమేశ్గౌడ్, శివకుమార్, వెంకటేశ్, మునిస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.