జడ్చర్ల టౌన్, మార్చి 20 : బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ మూడు నెలల ఈఎంఐ డబ్బులను వే యించుకొని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎస్సై కథ నం మేరకు.. జడ్చర్ల మండలం మాచారం గ్రామానికి చెందిన రాజు ప్రైవేటు ఉద్యోగి. రెండేండ్ల కింద ట యాక్సిస్ బ్యాంకులో పనిచేసే అరుణ్రాజ్.. రా జుకు పరిచమయ్యాడు. ఈ క్రమంలో రాజుకు బ్యాంకులో పర్సనల్ లోన్ ఇప్పించాడు. కొన్నాళ్ల త ర్వాత మళ్లీ పర్సనల్ లోన్ టాప్ఆప్ చేయిస్తానం టూ రాజు వద్ద ముందస్తుగా మూడు నెలల ఈఎం ఐ డబ్బులు రూ.1.27లక్షలు నిందితుడు అరుణ్రాజ్ తన బ్యాంకు అకౌంట్లోకి వేయించుకున్నా డు. ఆ తర్వాత లోన్ టాప్ఆప్ కోసం ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వకుండా, తిరిగి డబ్బులు వాపసు ఇవ్వకుండా తిప్పుతుండడంతో అరుణ్రాజ్ తనను మోసం చేశాడంటూ పేర్కొంటూ బు ధవారం జడ్చర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.