దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), మే 2 : కాంగ్రెస్, బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గురువారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి, తిర్మలాపూర్, ఇస్రంపల్లి, కౌకుంట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాగా కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన బెల్లం రాములు, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్రెడ్డితోపాటు పలువురు నా యకులు ఆల సమక్షంలో కారెక్కగా వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.