అచ్చంపేటరూరల్, డిసెంబర్29 : మండలంలోని బొమ్మనపల్లి శివారులో లక్ష్మీదేవిగండి తండాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి నల్లబెల్లం, స్పటిక బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.అచ్చంపేట ఎక్సైజ్ సీఐ కృష్ణ య్య కథనం ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం దాడు లు నిర్వహించగా 330 కిలోల నల్లబెల్లం , 150 కిలోల స్పటికను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. తండాకు సమీపంలోని అడవిలో వీటిని దాచిపెట్టగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
కాట్రావత్ కుమార్ తప్పించుకొని పారిపోయాడని అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ మహబూబ్నగర్ సీఐ గణపతి రెడ్డి, కృష్ణయ్య, ఎస్సైలు బాలరాజు, సతీశ్కుమార్, సిబ్బంది ఆంజనేయులు, బంతిలాల్, నవీన్, స్వాతి, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.