వనపర్తి, అక్టోబర్ 2 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం గోపాల్పేట, రేవల్లి మండలాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి రూ.26కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. రేవల్లి మండల కేంద్రంలో రూ.4.87 కోట్లతో నిర్మించిన కేజీబీవీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అందమైన విద్యాలయంగా రేవల్లి కేజీబీవీ నిలుస్తుందన్నారు. జిల్లాలోని 15 కేజీబీవీలకు సొం త భవనాలు ఉన్నాయని, ఐదింటిలో ఇం టర్మీడియట్ విద్య ఉందన్నారు. రేవల్లి కేజీబీవీలో వచ్చే విద్యా సంవత్సరం నుం చి ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్ని విద్యాలయాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఎంజీకేఎల్ఐ నీటికి పూజలు..
మున్ననూర్ గ్రామానికి చెందిన 28 కు టుంబాల దళిత రైతుల కోసం 25 ఎకరాలకు సంబంధించి ఎగువ ప్రాంతానికి సా గునీరు అందించేందుకు మంత్రి నిరంజన్రెడ్డి ఎంజీకేఎల్ఐ కాల్వకు రెండు బోర్లు ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో రై తులతో కలిసి బోర్ల నీళ్లు దుంకే చోట పూ లు చల్లి పూజలు చేశారు. రెండో పంట కోసం కేఎల్ఐ నీటికి ప్రత్యామ్నాయంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎస్సీ కా ర్పొరేషన్ ద్వారా ఏడు బోర్లు మంజూరు చేయించారు. భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో బోరుబావుల తవ్వకాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గోపాల్పేట మండలం చెన్నూరు, రేవల్లి మండలం గౌరిదేవిపల్లిలో చదువుకుంటున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే రేవలి మండల కేంద్రంలో చిట్యాల ఐల మ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏదుట్ల శివారులో జయన్న తిర్మలాపురం గ్రామానికి చెందిన యువ రైతు పరగోర్ల శివ ఎకరన్నరలో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. మహిళా రైతు కూలీలను పలకరించి రైతును అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మూహిక వ్యవసాయం వైపు రైతులు అ డుగులు వేయాలని, తద్వారా వ్యవసాయ కూలీల కొరత ఉండదన్నారు.
రూ.26 కోట్ల పనులకు శ్రీకారం
ఉమ్మడి గోపాల్పేట మండలంలో 18 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 19 ప్రారంభోత్సవాలు చేశారు. బుద్ధారంలో పీహెచ్సీ, డబుల్ బెడ్రూం నిర్మాణాలకు, చెన్నూరులో పీహెచ్సీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, తాడిపర్తి నుంచి చెన్నూరు వరకు, తాడిపర్తి నుంచి మున్ననూర్ వరకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు, మున్ననూర్లో బీసీ కమ్యూనిటీ హాల్, జయన్న తిర్మలాపురం నుంచి రేమొద్దుల రోడ్డు వరకు బీటీ రోడ్డు రెన్యూవల్ పనులకు, ఏదుట్లలో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జయన్మతిర్మలాపురంలో వాల్మీకి భవనం, రేమొద్దుల ఆర్అండ్బీ రోడ్డు నుంచి మాలగుట్ట వెనకకు వేసిన ఫార్మేషన్ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీలు సంధ్య, సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సింగిల్విండో అధ్యక్షుడు రఘుయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షులు తిరుపతియాదవ్, నా రాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కోదండం, రఘు రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.
మహిళలు ఐలమ్మ ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
ఖిల్లాఘణపురం, అక్టోబర్ 2 : ఐలమ్మ ధైర్యాన్ని నేటి మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని సోలీపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, సర్పం చు పద్మ, నా యకులు ఉన్నారు.
అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలి
పెద్దమందడి, అక్టోబర్ 2 : సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని జగత్పల్లి, మనిగిల్ల, పెద్దమందడి, దొడగుంటపల్లి గ్రామాల్లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్పల్లిలో రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవ న నిర్మాణానికి శంకుస్థాపన, రూ.10 లక్షలతో శివాలయం ప్రహరీ, మనిగిల్లలో రూ.6.5 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, మనిగిల్ల గ్రామం నుంచి చౌట చెరువు అలుగు వర కు, కొం డ రవి పొలం నుంచి బుగ్గపల్లి తండా వర కు ఫార్మేషన్ రోడ్డు, పెద్దమందడి మండలకేంద్రంలో రూ.20లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, రూ.20 లక్షలతో ఫార్మేషన్ రోడ్డు , దొడగుంటపల్లి నుంచి అంకూరు వరకు రూ.90లక్షలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పామిరెడ్డిపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
మంత్రి సమక్షంలో చేరికలు
మండలంలోని మనిగిల్ల గ్రామానికి చెందిన 60మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఉప సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్ కొండా ర వీందర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. పెబ్బేరు మం డలం గుమ్మడం తండాకు చెందిన 33 మంది తండా అధ్యక్షుడు హనుమంతునాయక్, యూత్ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో దొడగుంటపల్లిలో మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. గో పాల్పేట మండలంలోని జయన్న తిరు మలాపురం, రేవల్లి మండలంలోని గొల్ల పల్లి గ్రామానికి 50మంది మంత్రి సమక్షంలో బీఆర్ ఎస్లో చేరారు.