మక్తల్ టౌన్, జనవరి 9: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యం తో మనఊరు-మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి సనులు చేపడుతా మని తుందని ఆర్జేడీ వి జయలక్ష్మి అన్నారు. మన ఊరు మన బడి పథకం కింద పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు తెలంగాణ విద్యాశాఖ ప్రాంతీ య సంచాలకురాలు విజయలక్ష్మి సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ మండలం గుడిగండ్ల ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతోఆమె మాట్లాడుతూ మనఊరు మనబడి పథకంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రతి పాఠశాల భవనాన్ని రంగురంగుల బొమ్మలతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. జనవరి 9 నుంచి పనులు పూర్త యిన పాఠశాల భవనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సా రించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థిలో ప్రాథమిక సామర్థ్యాలను పెంపొందించేందుకు గుణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ తరగతుల ద్వారా ప్రతి వి ద్యార్థి ధారాళంగా చదవడం రాయడం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంపై శిక్షణ అందించి విద్యార్థుల సామర్యాలను పెంచేందుకు టీఎల్ఎం ద్వారా విద్యాబోధన కొనసాగించడం జరిగిందని తెలిపారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ పరీక్షలను డిసెంబర్ 30న నిర్వహించడం జరిగిందని పేర్కొన్నా రు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చక్కటి రీతిలో విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగా ణ విద్యాశాఖను సీఎం కేసిఆర్ పటిష్ట పరిచారన్నారు. గుడిగండ్ల ప్రాథమిక పాఠశాలలో తెలుగు, ఆంగ్లంలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు సమాధానాలను చెప్పడంతో ఆర్జేడీ విజయలక్ష్మి విద్యార్థులతోపాటు పాఠశాల ఉపాధ్యాయు లు హిమబిందు, నజియాబేగంను అభినందించారు. ఆర్జేడీ వెంట డీఈవో గోవిందరాజులు, ఎఫ్ఎల్ ఎన్ నోడల్ ఆఫీసర్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.