భూత్పూర్, జనవరి 21 : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్లో శనివారం 102మందికి రూ.41,92,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారని తె లిపారు. ఆపత్కాలంలో పేదలను సీఎంఆర్ఎఫ్తో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వా మన్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, జెడ్పీటీ సీ ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు నర్సింహాగౌడ్, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీ కాంత్యాదవ్, లక్ష్మీనర్సింహయాదవ్, శ్రీ నివాస్రెడ్డి, నారాయణగౌడ్ పాల్గొన్నారు.
దేవరకద్ర, జనవరి 21 : పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో 19మందికి రూ.6,96, 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో చిన్నరాజమూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రూ.11,500, కార్యకర్త వినోదమ్మ రూ.24వేల విలువైన చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపత్కాలంలో అందరిని అక్కున చే ర్చుకొని ఆదుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్తత్వమని తెలిపారు. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలోనే ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు.
మండలంలోని పెద్దగోప్లాపూర్కు చెంది న బీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల.. పెద్దగోప్లాపూర్కు వెళ్లి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే పెద్దరాజమూర్లో జ ర్నలిస్టు శ్రీనివాస్ తండ్రి మృతి చెందగా, అతడి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో డీపీఎల్ సీజన్-2 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకుగా నూ ప్రభుత్వం క్రీడాప్రాంగణాలను ఏర్పా టు చేస్తున్నదని తెలిపారు. ఆటల పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని చాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సింగిల్విండో చైర్మన్ నరేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖదీర్పాషా, సర్పంచులు శ్యాంసుందర్రెడ్డి, హన్మంతు, బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ తిరుపతయ్య, ఆలయ చైర్మన్ శివానంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాసులు, భాస్కర్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, భాస్కర్రెడ్డి, కుర్వ రాము, శంకర్, కొండల్ పాల్గొన్నారు.V
దేవరకద్రలో కౌకుంట్ల మండలం వెం కంపల్లికి చెందిన లక్ష్మీదేవమ్మ ను ఎమ్మె ల్యే ఆల ఆప్యాయంగా పలకరించారు. దేవరకద్రకు ఏ పనిపై వచ్చావని ఆరా తీయగా, తనకు నాలుగెకరాల భూమి ఉందని, రైతుబంధు డబ్బులను తీసుకోవడానికి వచ్చినట్లు పేర్కొంది. ఎవుసానికి రైతుబంధు డబ్బులు ఇస్తున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని దీవించింది.