నారాయణపేట, జనవరి 2 : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీ సీఆర్బీ డీఎస్పీ వెంకటేశ్వరరా వు అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జనవరి 1 నుంచి 31 వరకు ని ర్వహించే ఆపరేషన్ స్మైల్ 9 ని ర్వహణపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్ డిపార్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్, చైల్డ్లైన్, బాలరక్షా భవన్, సఖి సెంటర్, స్మైల్ టీం తదితర శాఖలకు చెందిన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి మాట్లాడా రు. 18 ఏండ్ల లోపు పిల్లలు బాలకార్మికులుగా ప ని చేస్తుంటే వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోంకు త రలించాలన్నారు. తాత్కాలిక ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకొని తమ పిల్లలను పనులకు వినియోగించుకోరాదన్నారు. పిల్లలను బడి మాన్పిం చి పనులకు ఉపయోగిస్తే నేరంగా పరిగణిస్తామ న్నారు. ఆపరేషన్ స్మైల్ 9లో ఒక ఎస్సై, నలుగురు సిబ్బందిని నియమించామని, ఇతర శాఖలతో క లిసి సమన్వయంతో పనిచేస్తూ బాలలు పనిచేస్తు న్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలన్నారు. బాలకార్మికులు కనిపించినా, బాలలు శారీరక, మానసిక, లైంగికంగా, ఆర్థికంగా దోపిడీలకు గురై నా 1098, డయల్ 100కు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 7 ఫిర్యాదులు
పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు విభాగం లో మొత్తం 7 ఫిర్యాదులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు. ఫి ర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.