వనపర్తి: అనారోగ్యాల బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు మండల, గ్రామాల, పట్టణాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి విడుద లైన 47 మందికి రూ. 11.31లక్షల విలువ గల చెక్కులను నేరుగా మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు.
ముందుగా వారి ఆరోగ్య క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చిన డబ్బులను ఇతర అవసరాల నిమిత్తం కాకుం డా ఆరోగ్య దృష్ట్యా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అనంత రం బాధితులతో అల్పహారం కార్యక్రమంలో పాల్గొ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, ఆయా మండలాల, గ్రామాల, పట్టణాల నాయకులు బాధితులు తదితరులు పాల్గొన్నారు.