మక్తల్, జూలై 15 : రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వానలు పడక పంటలు ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన సీఎం పంటలు కాపాడుకోవాలంటే రైతుల రక్తంతో పంటను కాపాడుకోవాలని మాట్లాడడం చూస్తుంటే, ఈ సీఎం తన పరిపాలన ఒత్తిడి అంతా రైతులపై వేస్తున్నారని అర్థమవుతుందన్నారు.
ప్రస్తుతం కృష్ణ, భీమా నదుల్లో నీరు లేక రైతులు పంటలు సాగు చేయడానికి అరిగోస పడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు రోజు 80వేల క్యూసెకుల వరద వచ్చి ప్రాజెక్టుల్లో చేరుతుందని, ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి తెలంగాణ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సత్తాలేని సీఎం అని దుయ్యబట్టారు. సమా వేశంలో పార్టీ నాయకులు ఉన్నారు.