మహబూబ్నగర్, సెప్టెంబర్ 28 : బాలల హక్కుల ను విస్మరించకుండా పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య కోరారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ నిమిత్తం అమలు చేస్తున్న కార్యక్రమాలను అదనపు కలెక్టర్, అధికారులతో సమీక్షించారు. పోక్సో చట్టం అమలు, బాలకార్మిక వ్యవస్థ, బాలలకు అందించే పౌష్టికాహారం, జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరు, బాలల ఆరోగ్యం, విద్య, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్య నుంచే బాలలకు వారి హక్కులను అనుభవించే లా అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.
అంగన్వా డీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆహారం తీసుకునే సా మర్థ్యం మేరకు బలవర్థకమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. పరిమితి విధించకూడదని, అన్ని కేం ద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫ్యాన్లు, ఆట స్థ లాలు ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారంతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాల, కళాశాల విద్యార్థు లు, యువతకు అన్ని వర్గాల వారికి కళాజాత కార్యక్రమాలతో అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా లైంగికదాడికి గురైతే వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వ రకు సుమారు 15 వేల పోక్సో కేసులు నమోదైనట్లు తెలిపారు. బాల్య వివాహాలను నిరోధించాలని ఆదేశించా రు. జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరు పై కూడా సమీక్షించారు. నిర్లక్ష్యానికి గురైన పిల్లలపై జా గ్రత్త తీసుకోవాలన్నారు. అన్ని హాస్టళ్లు, పాఠశాలలో ఫి ర్యాదుల బాక్స్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు దేవయ్యకు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, డీ ఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, ఇన్చార్జి అధికారి నర్మద, వి ద్యాశాఖాధికారి రవీందర్, అధికారులు పాల్గొన్నారు.