గద్వాల, ఫిబ్రవరి 9 : పెండింగ్లో ఉన్న పారితోషికాలను చెల్లించాలని, గత ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరు తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి నెలా 2వ తేదీన తమ ఖాతాల్లో పారితోషికాలు జమ చేసేదని, ప్రస్తుతం రెండు నెల లు దాటినా వాటిని చెల్లించక పోవడంతో అప్పులు చేయా ల్సి వస్తున్నదని వాపోయారు.
అభయహస్తం, మహాలక్ష్మి వంటి అదనపు పనులు చేయిస్తున్నారని, వాటిని తమకు అప్పగించొద్దని కోరారు. ఏఎన్సీ డెలివరీల పేరుతో టార్గెట్ పెట్టి భయబ్రాంతులకు గురిచేసే విధానాన్ని రద్దు చేయాలని, సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా కింద రూ.5లక్షలు చెల్లించాలని, ప్రమోషన్స్, ప్రసూతి సెలవులు వంటి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో కు అందజేశారు.