నారాయణపేట, జనవరి 4 : పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స త్యనారాయణ అన్నారు. పట్టణంలోని పలు మెకానిక్ షాపులు, హాటళ్లు, కిరాణం షాపులు, వెల్డింగ్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆపరేషన్ స్మైల్ 9 బృందం సభ్యులు బుధవారం దాడులు నిర్వహిం చి 9 మంది బాలకార్మికులను పట్టుకొని సీడబ్ల్యూసీకి అప్పగించారు. పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బాలలను పనిలో పెట్టుకున్న వా రికి జరిమానా విధించడం, కేసులు నమోదు చే యడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా బాలకార్మికులు కనపడితే డయల్ 100కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.
వేధింపులకు గురైతే సమాచారమివ్వాలి
పాఠశాలలు, నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలలో అమ్మాయిలు వేధింపులకు గురైతే షీ టీమ్ పోలీసులకు సమాచారమివ్వాలని షీ టీమ్స్ జిల్లా ఇన్చార్జి, ఎస్సై సుధామాధురి తెలిపారు. ప ట్టణంలోని జ్యోతిబా ఫూలే పాఠశాలలో విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వేధింపులు, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, సెల్ఫోన్ వినియోగంతో కలిగే అనర్థాలు తదితర అంశాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కా లంలో సెల్ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయి సమాయాన్ని వృథా చేసుకోవడం జరుగుతుందని, సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించుకొని చదువుపై శ్ర ద్ధ కనబర్చాలన్నారు. ఉన్నత ఆశయాలు, చదువు లో ముందజ, సమాజంలో గొప్ప పౌరులుగా త యారు కావడానికి ఉపయోగపడుతుందన్నారు. చిన్నతనం నుంచి అర్థవంతమైన క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, బాధ్యతగా పనులు నిర్వహించుకోవడం తదితర విషయాలు అలవరచుకోవాలన్నారు. పాజిటివ్ ఆలోచనలతో ఉన్నత లక్ష్యాల ను నిర్దేశించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.