సూరత్ : కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి బర్త్ డే వేడుకలు జరిపి.. ఆమెలో ఉత్సాహాన్ని నింపారు వైద్యులు. కరోనాకు గురైన ఓ మహిళ సూరత్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏప్రిల్ 22 ఆమె పుట్టిన రోజు కావడంతో.. డాక్టర్లు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. తుమ్ జియో హాజారో సాల్ పాట పాడి ఆ రోగిలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో ఆమె కూడా చప్పట్లు కొడుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనాతో బాధపడుతున్న రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వైద్యులు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ముంబై ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.