వెన్నెముక, తుంటి కీళ్ల నొప్పిని కలిగించే యాంకైలోసింగ్ సమస్యను పరిష్కరించేందుకు జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి వైద్యులు దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ కోతతో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ను విజయవంతంగా నిర్వహించారు. బుధవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను అపోలో హెల్త్సిటీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.పరిపాటి శరత్కుమార్ వెల్లడించారు. సోమాలియాకు చెందిన లిబాన్(22) అనే విద్యార్థి గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వెన్నునొప్పితో పాటు తుంటినొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకూ సమస్య తీవ్రం కావడంతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేరాడు. అతడి సమస్యను యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ అని గుర్తించిన వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించారు. అతితక్కువ కోతతో చేసే మినిమల్ ఇన్వేసివ్ విధానం ద్వారా సర్జరీ చేయాలని నిర్ణయించుకున్న డా.శరత్కుమార్ బృందం కేవలం కొంత మేర మాత్రమే కోతతో విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. దక్షిణభారతదేశంలోనే తొలిసారిగా ఈ విధానం ద్వారా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరిగిందని డా.శరత్కుమార్ తెలిపారు. సర్జరీ అనంతరం ఏడుగంటల్లోనే రోగి డిశ్చార్జ్ అయ్యాడని ఆయన వెల్లడించారు.