నారాయణపేట, సెప్టెంబర్ 16 : గ్రూప్ 3, 4కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బీసీ స్టడీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాని కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాకు 748 ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్ విధానంతో ఇతర జిల్లాల వారికి కా కుండా సొంత జిల్లాల వారికే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. నిరుపేద విద్యార్థులు పట్టణాలకు వెళ్లి అధిక డబ్బులు వెచ్చించి శిక్షణను తీసుకోలేరని గమనించి ప్రభుత్వం జిల్లాకేంద్రాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసిందని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు. విద్యార్థు లు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. స్టడీ సెంటర్కు వ చ్చే విద్యార్థులకు అల్పాహారం అందించడంతోపాటు ఉచితంగా మెటీరియ ల్ అందిచనున్నట్లు ఆయన చెప్పారు. స్టడీ సెంటర్కు వచ్చే విద్యార్థులకు క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చే స్తామన్నారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ గత ఏప్రిల్లో ఎస్సీ, ఎస్టీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణను అం దించారని, శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. దేశంలోనే ఎక్క డా లేని విధంగా రాష్ట్రంలో జోనల్ విధానం తెలంగాణలో ఉందన్నారు. జోనల్ విధానం వల్ల స్థానికంగా ఉన్న యువతకే ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, స్టడీ సెంటర్ ఇన్చార్జి నారాయణగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.