శ్లోక: న నిర్మితో కేనన దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగః
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశకాలే విపరీత బుద్ధిః
భావం: బంగారు లేడిని గతంలో ఎవరైనా కన్నారా? విన్నారా? అయినప్పటికీ సీత కోరిందని శ్రీరాము డంతటి వాడు దాని గురించి
వెళ్లి కష్టాలపాలైనాడు. కష్టాలపాలు కావాల్సిన టైం వచ్చినపుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయి.-టి.సుధాకరశర్మ
జాతీయ సాహిత్య పరిషత్-కరీంనగర్
రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి కథల సంపుటాలకు ఆహ్వానం ప్రముఖ కవి, రచయిత, నాట్యాచార్యులు రజనీశ్రీ పేరు మీద కరీంనగర్ జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాహిత్య పురస్కారాన్ని ఆమె కుమారుడు, సాహితీవేత్త, జీవీ శ్యాంప్రసాద్ లాల్, ఐఏఎస్ అందజేస్తున్నారు. ఈ పురస్కారం కింద ప్రశంసాపత్రం, శాలువాతో పాటు రూ.10,116 నగదు బహుమతి అందిస్తామని సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్ తెలిపారు. స్వంత కథల పుస్తకాలు మాత్రమే పంపాలని, వివిధ రచయితలతో సంకలనం చేసి ముద్రించిన కథల పుస్తకాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. రచయితలు వారి కథల సంపుటాలు జనవరి 2023 నుండి 2025 డిసెంబర్ 31లోగా ముద్రించినవి మాత్రమే పోటీలకు పంపించాలని సూచించారు. ప్రతిదీ నాలుగు ప్రతులు ఈ కింది చిరునామాకు 20 మార్చి, 2026లోగా చేరునట్లు పంపించాలని పేర్కొన్నారు. ప్రతులు పంపించాల్సిన చిరునామా: గాజుల రవీందర్, ఇంటి నంబర్ 8-3-255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నంబర్ 12, భగత్నగర్, కరీంనగర్-505001. మరిన్ని వివరాలకు గాజుల రవీందర్ ఫోన్ నెంబర్ 98482 55525 లేదా ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ 9490401861 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు.