తెలంగాణ మాగాణంలో కవితాధార లు ప్రవహింప చేసి న మొదటితరం కవయిత్రులలో చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అగ్రగణ్యులు. 80వ దశకంలో అభినవ మొల్లగా పేరుగాంచిన కవి పండితురాలు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే విదుషీమణి.
చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ 1939 జనవరి 3న భద్రాచలంలో జన్మించారు. వీరి తండ్రి పొడిచేటి వీరరాఘవచార్యులు భద్రాచల సీతారాముల ఆలయ ప్రధానార్చకులు. లక్ష్మీ నరసమ్మ తన ఏడేండ్ల వయస్సులోనే గాంధీజీ మరణవార్త విని ‘భారత జనకుడు ఇక లేడు గాంధీతాత ఇకలేడు’ అంటూ కవితా ప్రస్థానం సాగించారు. అలా ఆ మె పలు పద్య, గద్య కావ్యాలు రాశారు. ఆమె రాసిన ‘భద్రగిరి’ అనే నవలకు మహాకవి దాశరథి పీఠిక రాశారు.
1981లో రామదాసు పద్యకావ్యం రాయగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ఆమె రచనా ప్రావీణ్యతను గుర్తించి ‘అభినవ మొల్ల’ బిరుదు ను ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు, రెండు తెలుగు రాష్ర్టాలు ఆమెకు పలు పురస్కా రాలు ఇచ్చి గౌరవించాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో వీరు గౌరవ సత్కారం పొందారు. వీరు రాసిన ‘ఆడపిల్ల’ కవితను వెన్నెల-3 అనే తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టా రు. ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా మను షు లు, ప్రకృతి, పర్యావరణం వంటి ఎన్నో విష యాలపై రచించిన కవిత్వాన్ని ‘నీరాజనం’ పేరుతో పద్య కవితా సంపుటి వెలువరించారు. ఇవే కాక వీరు అనేక గేయాలు, పాటలు రాశారు. వీరు రాసిన 11 కావ్యాలు సంకలనంగా వెలు వడ్డాయి. రాయల వారు రచించిన ఆముక్త మాల్యద కథను నవలా రూపంలో రచించారు. దీనిపై కాకతీయ యూని వర్సిటీలో ఎం.ఫిల్ కూడా వచ్చింది.
1998లో యునెస్కో సాహితీ స్వర్ణమహిళ, యునెస్కో లిటరసీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పుర స్కారాలు అందుకున్నారు. 2018లో తెలంగాణ ప్రభుత్వం ఆమెను ‘విశిష్ఠ మహిళా పురస్కారం తో సత్కరించింది.
సంప్రదాయ కవిత్వంలోనూ ఆధునిక విప్లవ భావాలను రాసిన తెలంగాణ ముద్దుబిడ్డ చక్ర వర్తుల లక్ష్మీ నరసమ్మ. అనారోగ్యంతో పోరాడి డిసెంబర్ 7న తుదిశ్వాస విడిచారు. వారి సాహి తీ సేవకు అక్షర నీరాజనాలిస్తూ శ్రద్ధాంజలి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
98663 60082