నటుడికైనా, నటికైనా ఓ జీవితకాల స్వప్నం ఉంటుంది. ఫలానా పాత్రలో నటించే అవకాశం వస్తే బాగుండు అనిపిస్తుంది. అతి తక్కువమంది మాత్రమే అలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేసి.. చరిత్ర సృష్టిస్తారు. ఆ జాబితాలో బాలీవుడ్ నటి స్వరభాస్కర్ చేరారు. రాంఝానా, వీర్ ద వెడ్డింగ్, అనార్కలీ ఆఫ్ ఆరా తదితర సినిమాలతో బాలీవుడ్ తెరమీద తనకంటూ ప్రత్యేక గుర్తింపు
తెచ్చుకున్న స్వరభాస్కర్.. ఓ వినూత్నమైన పాత్రలో నటించబోతున్నారు.
తాజాగా ఆమె ‘మిసెస్ ఫలానీ’ చిత్రానికి సంతకం చేశారు. ఈ మూవీకి మనీష్ కిశోర్, మధుకర్ వర్మ దర్శకులు. ఇందులో స్వర తొమ్మిది పాత్రల్లో కనిపించనున్నారు. 30 నుంచి 42 ఏండ్ల వయసు కలిగిన తొమ్మిది మంది మహిళల పాత్రలను స్వర భాస్కర్ ఒక్కరే పోషించనున్నారు. గతంలో ప్రియాంక చోప్రా కూడా పన్నెండు పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు స్వర వంతు!