అతివల అందంలో చేతిగోర్లది ప్రత్యేక స్థానం. గోర్ల అందాన్ని ఇనుమడించేందుకు రకరకాల క్లీనర్లు, పాలిష్లు వాడుతుంటారు. అయితే మహిళలు తరుచుగా వాడే నెయిల్ పాలిష్తో క్యాన్సర్ ముప్పు ఉందంటున్నారు నిపుణులు. గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
నెయిల్ పాలిష్లోని రసాయనాలు గోళ్లలోకి ప్రవేశించి శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జెల్ నెయిల్ పాలిష్పై ప్రసరించిన కాంతి యూవీ కిరణాలుగా మారుతుందట. యూవీ కిరణాలు చర్మక్యాన్సర్కు దారితీస్తాయి. అంతేకాదు అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి జెల్ పాలిష్ వేసుకునే ముందు వేళ్లపై సన్స్క్రీన్ లోషన్ అప్లయ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకోసారి నెయిల్ పాలిష్ మార్చుకునే అలవాటు ఉన్నవాళ్లు ఆ పద్ధతికి స్వస్తి పలకడం మంచిది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గోర్లకు రంగులు అద్దండి. తక్కువ రసాయనాలు కలిగిన బ్రాండ్లను కొనుగోలు చేయడం మరీ మంచిది. గోరంత అందం కోసం కొండంత కష్టం కొనితెచ్చుకోలేం కదా!