Naya Mall | ప్రీమియం కార్ల తయారీ కంపెనీ.. ‘ఫెరారీ’కి ఉండే క్రేజే వేరు. ఆ సంస్థ నుంచి ఓ సరికొత్త హెడ్ఫోన్ విడుదలైంది. సంగీత ప్రియులే లక్ష్యంగా.. ‘బియోప్లే హెచ్95’ మాడల్ను మార్కెట్లో ప్రవేశపెట్టిందీ దిగ్గజ సంస్థ. స్టయిల్, పర్సనాలిటీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, స్పోర్టీ డిజైన్తో వస్తున్న ఈ హెడ్ఫోన్.. ఇదివరకు లేని అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతున్నది. ఈ ప్రీమియం హెడ్సెట్ ఖరీదు.. రూ. 1,08,230. bang-olufsen.com వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇప్పుడు కంప్యూటర్ లేని ఇల్లు లేదు. కంప్యూటర్ అవసరంలేని పనిలేదు. అయితే, రోజూ కంప్యూటర్ వాడటం వల్ల.. కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతున్నది. ఈ పరిణామం.. సాంకేతిక నిపుణులకు ఇబ్బందిగా మారుతున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ.. ‘డెల్’ సరికొత్త మానిటర్ను తయారుచేసింది. ‘డెల్పీ2424హెచ్టీ’ పేరుతో విడుదల చేసిన ఈ మానిటర్లో 24 అంగుళాల టచ్స్క్రీన్ అమర్చి ఉంటుంది. ఇందులోని ‘కంఫర్ట్ వ్యూప్లస్’ టెక్నాలజీ వల్ల కళ్లపై ఏమాత్రం ఒత్తిడిపడదు. ఇందులోని మరో ప్రత్యేకత.. మానిటర్ స్టాండ్. వినియోగదారుల ఎత్తు, సౌకర్యాన్ని బట్టి.. ఈ మానిటర్ను సర్దుబాటు చేసుకోవచ్చు. టేబుల్కు దగ్గరగా మడిచిపెట్టి, ట్యాబ్లా కూడా వాడుకోవచ్చు. అంతేకాదు.. ఈ మానిటర్ తయారీలో 85శాతం పునర్వినియోగించే ప్లాస్టిక్ను ఉపయోగించారు. అందువల్ల ఈ
ఉత్పత్తిని కొనుగోలు చేస్తే.. పర్యావరణానికి మేలు చేసినవాళ్లం అవుతాం. ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 10 పాయింట్ టచ్, యూఎస్బీ – సీ పవర్కేబుల్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్న ఈ మానిటర్ ధర. రూ.26,999. dell.comతోపాటు అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నది.
హ్యాండ్బ్యాగ్.. మహిళల ఫ్యాషన్లో విడదీయరాని భాగమై పోయింది. అయితే, బయటికి వెళ్లిన ప్రతిసారీ పెద్దపెద్ద హ్యాండ్ బ్యాగులను పట్టుకెళ్లడం ఇబ్బందే! సినిమాలకో, ఫ్రెండ్స్తో కలిసి కాఫీకో వెళ్లినప్పుడు.. ఓ చక్కటి క్లచ్ను తీసుకెళ్లడం మంచిది! ఎందుకంటే.. కొద్దిపాటి డబ్బు, క్రెడిట్/ డెబిట్ కార్డులు, సెల్ఫోన్ తప్ప వేరే వస్తువులేవీ ఉండవు కాబట్టి.. ఈ మినీ హ్యాండ్బ్యాగ్ చక్కగా సరిపోతుంది. ప్రముఖ ఫ్యాషన్ సంస్థ ఎలాహే.. హృదయాకారంలో, రంగుల కలయికలతో ఓ మినీ క్లచ్ను రూపొందించిది. దీని ధర రూ. 7,800. elahe.in వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
సాంకేతిక దిగ్గజం గూగుల్.. ఆచితూచి ఉత్పత్తులను విడుదల చేస్తుంటుంది. ఎందుకంటే.. వాటిలో ఏ చిన్నలోపమూ ఉండకూడదని భావిస్తుంది. ఇటీవలే ‘గూగుల్ పిక్సెల్ వాచ్ 2’ను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇంతకుముందు పిక్సెల్ వాచ్తో పోలిస్తే.. ఈ కొత్త వాచ్లో అనేక ఫీచర్లను మెరుగుపరిచింది. క్వాల్కామ్ 5100 చిప్సెట్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీతో ఈ స్మార్ట్వాచ్ను అందుబాటులో ఉంచింది. ఎల్టీఈ, వైఫై.. రెండు వేరియంట్లలో వచ్చిన ఈ వాచ్లో 3డీ కర్వ్డ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లాంటి అదనపు సౌకర్యాలను జోడించింది. ఇక అన్ని స్మార్ట్ వాచీల్లాగే.. కంపాస్, ఆల్టీమీటర్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, యాంబియెంట్ లైట్ సెన్సర్, బారోమీటర్, మ్యాగ్నెటోమీటర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. 306ఎంఏహెచ్ బ్యాటరీతో 24 గంటల వరకూ నిర్విరామంగా పనిచేస్తుందని గూగుల్ చెబుతున్నది. కాంటాక్ట్ పిన్ ద్వారా కూడా ఈ వాచ్ను చార్జ్ చేసుకునే ఆప్షన్ను అందించింది. రూ.39,900 పలుకుతున్న గూగుల్ పిక్సెల్ వాచ్2.. store.google.comతో పాటు అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో లభిస్తుంది.