పార్లే అనగానే చాలామందికి బిస్కెట్లు మాత్రమే గుర్తుకొస్తాయి. భారతీయ రిటైల్ మార్కెట్ను గమనించేవారికి మాత్రం అది విదేశీ కంపెనీలను తట్టుకుని మరీ విజయం సాధించిన మేడ్ ఇన్ ఇండియా సంస్థ అని అర్థం అవుతుంది. పార్లే తన ప్రాభవాన్ని కోల్పోయినా లిమ్కా, థమ్సప్ లాంటి ప్రతిష్ఠాత్మక ఉత్పత్తులను ఇతర కంపెనీలకు అమ్మేయాల్సి వచ్చినా… బిస్లరీని మాత్రం తన వద్దే ఉంచుకుంది. ఇదేమంత తెలివైన నిర్ణయం కాదన్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే మినరల్ వాటర్ వ్యాపారంలోకి ఇప్పటికే చిన్నాచితకా సంస్థలు సైతం వచ్చేశాయి.
ఓ ఆరువేల కంపెనీల వరకూ ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు అంచనా. కానీ పార్లే బాధ్యతలను తీసుకున్న తర్వాత, జయంతి ఖాన్ చౌహాన్… బిస్లరీని లాభాల వైపు తీసుకెళ్తున్నారు. ఆ సంస్థ వైస్ చైర్ పర్సన్గా మినరల్ వాటర్ అంటే బిస్లరీనే గుర్తుకొచ్చేలా చేస్తున్నారు జయంతి. ఆమె నాయకత్వంలో బిస్లరీ రెండువేల కోట్ల రూపాయల మైలురాయిని దాటేసింది. విస్తరణకు పరిమితులు ఉన్నా, సరికొత్త అనుబంధ బ్రాండ్స్ మొదలుపెట్టారు. అంతేనా! విపరీతమైన పోటీ ఉన్న మధ్య ప్రాచ్యంలోకి బిస్లరీని తీసుకువెళ్లడమే తన లక్ష్యమని చెబుతున్నారామె.