అధిక రక్తపోటు అనగానే గుండె వేగం పెరుగుతుంది. ఆ ప్రభావం అలాంటిది మరి! శారీరక శ్రమ కరువైన జీవనశైలికి పోషకాలు లేని ఆహారం తోడు కావడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఎక్కువగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రక్తపోటును నియంత్రించేందుకు రకరకాల మార్గాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి సెలరీ టీ. సెలరీ అనేది ఓ రకమైన తోటకూర. ఒకప్పుడు పెద్దగా తెలియకపోయినా, ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నది. పొడి లేదా రసం రూపంలోనూ లభిస్తున్నది. వంద గ్రాముల సెలరీ ఆకులను సన్నగా తరిగి పెట్టుకుని, 50 గ్రాముల ఖర్జూరం ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఓ లీటరు నీటిలో మిశ్రమాన్ని అరగంట సేపు మరిగించాలి. రోజుకు మూడుసార్లు ఆ పానీయాన్ని తాగొచ్చు. ధమనులను ఆరోగ్యంగా ఉంచే శక్తి ఈ ఆకుకూరకు ఉందని అంటారు. ఇక ఖర్జూరాలలో ఉండే పొటాషియం ఒంట్లోని సోడియం నిల్వలను నియంత్రణలో ఉంచి.. రక్తపోటును అదుపు చేస్తుందని నిపుణుల మాట.