ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమిటీ అద్యక్షురాలుగా మేదరమెట్ల స్వరూపరాణి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం టిఆర్ఎస్ కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, చిరుమామిళ్ల కిరణ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, తన్నీరు శోభారాణి, లక్ష్మి ప్రపన్న , తదితరులు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
టిఆర్ఎస్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్వంలో ఆమెకు శాలువావా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా యండీ షంషుద్దీన్, షకీనా, ఎస్కే.ఫరీద్ ఖాద్రి, రెహమాన్, మున, అన్వర్ఖాన్, అసిన్వలి,జానీ తదితరులు పాల్గొన్నారు.