ఖమ్మం : ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 2,3,4వ తేదీలలో జరిగే జాతర సందర్భంగా ముందుగా అమ్మవారి విగ్రహాన్ని కదిలించి సమ్మక్క సారక్కలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. గురువారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ పూజారి ఉప్పిసాయి తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, సాయి, సతీష్, మున్నా, లింగయ్య ,కుమారమ్మ, సుభద్రమ్మ,రాజమ్మ ,గణేష్,వెంకట్ ,వెంకీ తదితరులు పాల్గొన్నారు .