మధిర టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్-16 సబ్జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు జరిగాయి. పోటీలను ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, సీఐ మురళి, ఎంఈవో ప్రభాకర్ ప్రారంభించారు. బాలుర జట్టుకు బి.గోపి, పవన్, అజయ్, ఉపేంద్ర, జాన్పాషా, పి.గోపి, అబ్దుల్మాలిక్, వెంకటకృష్ణ, ఎం.శివనాగరాజు, వి.సాయికృష్ణ, జి.శ్రీను, ఎం.బాలు, బాలికల జట్టుకు కె.వైష్ణవి, వై.బిందు, వి.అమృత, బి.కావ్య, సీహెచ్ నందిని, ఎల్.నవ్యనందిని, పి.విజయమేరి, సీహెచ్ పావని, ఎస్.హిందూ, ఎన్.రేణుక, ఆర్.రమ్య, హాసిని ఎంపికయ్యారు.
వీరు ఈనెల 13న జరుగనున్న జిల్లాస్థాయి పోటీలో పాల్గొనున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుడు లాలయ్య, వ్యయామ ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి, విజయభాస్కర్, ప్రవీణ్, జమలయ్య, చిన్ని శ్రీను, సాంబశివరెడ్డి, సైదులు, సత్యనారాయణ, కోటయ్య పాల్గొన్నారు.
కూసుమంచిలో..
కూసుమంచి, డిసెంబర్ 10: మండల కేంద్రంలో శనివారం కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కిష్టాఫర్ ఆధ్వర్యంలో అండర్-16 బాలబాలికల నియోజకవర్గ కబడ్డీ జట్ల ఎంపిక జరిగింది. బాలికల జట్టుకు నాగమణి, మౌనిక, శ్రీతేజ, వినీల, మేఘన, షబీదా, ఉషారాణి, మహేశ్వరి, స్వాతి, ప్రసన్న, వినీత, కవిత, వినీల ఎంపికయ్యారు.
బాలుర విభాగంలో సందీప్, సతీశ్, సాయిరాం, రాజు, సుమత్, అనిల్, రామ్, మోహన్, గౌతమ్, మహేశ్, ఉపేందర్, కార్తీక్, మాధవ్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్స్ జిల్లా అధికారి మద్దినేని పాపారావు, పాలేరు క్రీడల ఇన్చార్జి నాగప్రసాద్, సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్రావు, హెచ్ఎం రేలా విక్రమ్రెడ్డి, పీడీలు పాల్గొన్నారు.