ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హోల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు రెండో రోజు ఆదివారమూ విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి వినియోగదారులు వచ్చి షోలోని స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని పేర్కొన్నారు. రియల్ రంగానికి రాష్ట్ర సర్కారు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇబ్బందులు తొలగించేందుకు, సులభతరంగా అనుమతులు పొందేందుకు మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ ఎంతో ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. రెండేళ్లుగా ‘నమస్తే తెలంగాణ’ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రాపర్టీ షోలు వ్యాపార వర్గాలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇలాంటి వేదికల ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో స్తిరాస్తులు కొనుగోలు చేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుందన్నారు. వివిధ రకాల కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రయోజనం చేకూర్చిన ‘నమస్తే’ యాజమాన్యం చొరవ అభినందనీయమని అన్నారు.
ఖమ్మం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రాపర్టీ షోల ఏర్పాటుతో కొనుగోలుదారులకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో రెండో రోజు ఆదివారం ముగింపు కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి పువ్వాడకు నమస్తే తెలంగాణ ఖమ్మం యూనిట్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి పువాడ అజయ్ పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
హైదరాబాద్ తరువాత అదే స్థాయిలో అన్ని రంగాల్లో పోటీపడి ఎదుగుతున్న నగరం ఖమ్మమని స్పష్టం చేశారు. ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నది గనుకనే అనేక సాపింగ్ మాల్స్, ఇతర కార్పొరేట్ కంపెనీలు సైతం నేడు ఖమ్మం వైపు చూస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా నేడు ఖమ్మం నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. రెండేళ్లుగా ‘నమస్తే తెలంగాణ’ ఏర్పాటు చేస్తున్న ప్రాపర్టీ షోకు మంచి ఆదరణ లభిస్తోందని వివరించారు. కెడ్రాయి లాంటి సంస్థలు సైతం ఈ షోలో పాల్గొంటే ప్రజలకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధైర్యంగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. గతంలో కేవలం ఖమ్మం ప్రజలకే పరిమితమైనప్పటికీ నేడు పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు వచ్చి ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఖమ్మం రియల్ ఎస్టేట్ రంగంపై నమ్మకంతోనే పెద్ద ఎత్తున వినియోగదారులు వస్తున్నారన్నారు.
వినియోగదారుల నమ్మకానికి అనుగుణంగా సేవలు అందించాలని మంత్రి సూచించారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ ద్వారా నేడు నిర్మాణ అనుమతులు సులభతరమైనట్లు గర్తుచేశారు. గతంతో పోల్చుకుంటే అనతికాలంలోనే ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు. నగరం నలువైపులా విస్తరిస్తూ ఎంతో అభివృద్ధి చెందుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం అదే స్థాయిలో పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, పులిపాటి ప్రసాద్, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, శ్రీనిధి ఎన్క్లేవ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నం జగన్, జీఆర్ ఇన్ఫ్రా అధినేత జీ.రాంబాబు, నమస్తే తెలంగాణ ఆర్సీ ఇన్చార్జి శీలం శ్రీనివాస్, రిపోర్టర్లు మద్దెల లక్ష్మయ్య, పునాటి మనోజ్, మంత్రిప్రగడ శ్రీనివాసరావు, యాడ్స్ సిబ్బంది నాగరాజు, వెంకన్న, సురేందర్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
బాలాజీ ఎస్టేట్ క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న మంత్రి అజయ్కుమార్, సుడా చైర్మన్ విజయ్కుమార్, నగర మేయర్ నీరజ, బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, నమస్తే బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జ్ మాటేటి వేణుగోపాల్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు
ఇలాంటి షోలతో వినియోగదారులకు, వ్యాపారులకు ఎంతో మేలు
‘నమస్తే’ ప్రాపర్టీ షోలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రాపర్టీ షోలు వ్యాపార వర్గాలకు ఎంతగానో దోహదపడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హోల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో రెండో రోజు ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ప్రాపర్టీ షోలోని వివిధ స్టాళ్లను పరిశీలించి వాటి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా లేని విధంగా గడిచిన రెండేళ్లుగా ఖమ్మంలో నమస్తే తెలంగాణ యాజమాన్యం ఇలాంటి ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేస్తుండడం శుభసూచకమని అన్నారు.
ఈ వేదికల ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమకు ఇష్టమైన, అనుకూలమైన ప్రదేశాల్లో స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్టం అభివృద్ధిలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సారథ్యంలో ఖమ్మం నగరం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. అనతికాలంలోనే ఖమ్మం అభివృద్ధి చెందిన తీరు చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదని అన్నారు. అనంతరం డ్రా ద్వారా ఎంపికైన ఎస్బీఐ స్టాల్ నిర్వాహకులకు, ఎంట్రీల ద్వారా ఎన్నికైన ప్రజలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జనరల్ మేనేజర్ పద్మావతి, నాయకులు పాల్వంచ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఒకే వేదికపై రియల్, నిర్మాణ సంస్థలు
సహకరించిన ప్రతి ఒక్కరికీ ‘నమస్తే’, ‘తెలంగాణ టు డే’ కృతజ్ఞతలు
రుణ సదుపాయంపై అవగాహన కల్పించిన బ్యాంకర్లు
హర్షం వ్యక్తం చేసిన వినియోగదాలు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సూపర్ సక్సెస్ అయింది. రెండ్రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. సెలవుదినం కావడంతో ఉదయం 10గంటల నుంచే నగరవాసులతోపాటు, ఆయా మండలాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉద్యోగులు, వివిధ హోదాల్లో సేవలు అందించే నగర ప్రముఖుల రాకతో ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా చరిత్రలోనే రెండోసారి నమస్తే తెలంగాణ చేసిన కృషిని ప్రతిఒక్కరూ కొనియాడారు. తొలిరోజు అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండోరోజు ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ప్రాపర్టీ షో ద్వారా కలిగే ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి చేస్తున్న కృషిని వివరించారు.
ప్రాపర్టీ షోకు హాజరైన జిల్లా ప్రజలు
ప్రాపర్టీ షోలో స్టాల్స్ను ఏర్పాటు చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల నిర్వాహకులు, యాజమాన్యాలు తమకు లభించిన స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రాపర్టీ షోను సందర్శించిన వందలాది మంది నగరవాసులు తమ అభిరుచులకు తగ్గట్టుగా ప్లాట్ల ధరలను తెలుసుకోవడంతోపాటు, బుకింగ్ చేసుకోవడం జరిగింది. రుణ సదుపాయం కోసం పలువురు వినియోగదారులు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, డీసీసీబీ స్టాల్స్ను సందర్శించి హౌసింగ్ రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించడంతోపాటు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం రుణాల మంజూరీకి అందించడం జరిగింది. ఊహించిన దానికంటే నగరవాసులు, సబ్బండవర్గాల నుంచి వచ్చిన ఆదరణ పట్ల నమస్తే యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్తే తెలంగాణ ఖమ్మం యూనిట్ మేనేజర్ రేనా రమేశ్, ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెండోరోజు సందర్శకుల నుంచి వచ్చిన ఎంట్రీలను డ్రా తీయడం జరిగింది. కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఏసీపీ టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అప్జల్హాసన్, ఆర్వీఎస్ సాగర్, మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నందగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
దళారుల బెడద లేకుండా పోయింది..
ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయడం ద్వారా మాలాంటి వాళ్లకు ఎంతో మంచి కలుగుతుంది. ముఖ్యంగా బ్రోకర్లు, మధ్య దళారులు ఎవరు లేకుండా అసలైన ధర కనుక్కునేందుకు అవకాశం కలిగింది. ఈ రోజు నాతోపాటు నా స్నేహితులం కలిసి వచ్చాం. నగరంలో ఏఏ ప్రదేశాల్లో స్థలాల ధరలు ఏ విధంగా ఉన్నాయో క్షుణంగా తెలుసుకున్నాం. బ్యాంకు వాళ్లను కూడా కలిశాం. వడ్డీ వివరాలు తీసుకున్నాం. ఒక్క రోజులోనే ఇన్ని వెంచర్ల ధరలు కనుక్కునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– గుర్రం వెంకటేశ్వర్లు, సింగరేణి రిటైర్డ్ ఆఫీసర్
మరిన్ని ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయాలి
రాబోయే రోజుల్లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో మరిన్ని ప్రాప్ట షోలు ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ప్రయోజనం ఉంటుంది. ప్లాట్ కొనుక్కోవాలంటే నగరంలో ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఎంత ధర అని తెలుసుకోవాలంటే దాదాపు నెలరోజులు తిరిగితే కూడా అర్థం కాదు. కానీ ఇక్కడ ఒకే దగ్గర నగరం నలువైపులా వెంచర్లు ఏర్పాటు చేసిన సంస్థలు ఉండడం వల్ల ధరలు తెలుసుకోవడం సులభతరమైంది. అన్ని స్టాల్స్ను తిరిగి చూశారు. ధరలు కూడా తెలుసుకోవడంతోపాటు వారికి సంబంధించిన బ్రోచర్లను తీసుకోవడం జరిగింది. మంచి అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణకు ధన్యవాధాలు.
– కిరణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తెలంగాణ వచ్చాకే రియల్ ఎస్టేట్ అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందింది. గతంలో హైదరాబాద్కే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు ఖమ్మంలో బాగా పుంజుకుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతిఒక్కరి కల రియల్ ఎస్టేట్ ద్వారా సాకారమవుతున్నది. నచ్చిన విధంగా ఇళ్లు నిర్మాణాలు చేయడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొనుగోలు చేసేవారు నాణ్యతకే మొగ్గు చూపుతారు. నిర్వాహకులందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి హ్యాట్సాప్.
– బానోతు చంద్రావతి, వైరా మాజీ ఎమ్మెల్యే
ప్రకృతి ఒడిలో ఇంటి నిర్మాణాలు
స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఇంటి నిర్మాణాలు ఉన్నాయి. స్వచ్ఛతకు మారుపేరుగా ఉండడం వల్లనే కొనుగోలుదారులు ఇళ్లు కొంటున్నారు. ఎక్కడ వెంచర్ వేసినా ముందుగా అక్కడ గ్రీన్ల్యాండ్తో పాటు ఆవరణమంతా పచ్చగా ఉంటున్నది. ఎంత క్వాలిటీ ఉంటే జనం అంతముందుకు వస్తారు. నాడు ఊరు చివర్లంతా గుట్టలు, కుప్పలుతో ఉండేవి. నేడు అందాల హరివిల్లులుగా మారాయి. ఇది రియల్ రంగం గొప్పతనమే.
– ఆంజనేయులు, ఖమ్మం ఏసీపీ
మార్కెటింగ్ చేసుకునేందుకు మంచి అవకాశం
నమస్తే తెలంగాణ ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షో ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు మరింత అవకాశం కలిగింది. రెండు దశాబ్దాలుగా తమ సంస్థ ద్వారా వేలాదిమంది వినియోదారులకు సొంత స్థలం కల్పించాం. ఈ ప్రాపర్టీ షో ద్వారా అనేకమంది మా స్టాల్స్ను సందర్శించారు. ఇలాంటి అవకాశం కల్పించిన నమస్తే యాజమాన్యంకు కృతజ్ఞతలు. భవిష్యత్లో మరిన్ని ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయలని కోరుకుంటున్నా.
– జీ రాంబాబు, జీఆర్ ఇన్ప్రా మేనేజింగ్ డైరెక్టర్
హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
గతంతో పోల్చుకుంటే నేడు ఖమ్మం అన్నిరంగాల్లో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి జరగడం సంతోషంగా ఉంది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక విజన్ కారణంగా నేడు నగరంలోకి అనేక కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా ఐటీ కంపెనీలు సైతం వస్తున్నాయి. దీంతో రియల్ఎస్టేట్ రంగం సైతం మంచి అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఒకే వేదికపై అన్నిరకాల కంపెనీలను తీసుకవచ్చిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– అఫ్జల్హాసన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు
నమస్తే తెలంగాణ కృషి అభినందనీయం
ప్రాపర్టీ షో ద్వారా అనేక రియల్ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి అభినందనీయం. గతంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోకు సైతం ఇదే ఆదరణ రావడం కనిపించింది. రాబోయే రోజుల్లో మరింత విశాలమైన వేదిక ఏర్పాటు చేసిన అనేక ఇతర కంపెనీలను సైతం ప్రాపర్టీ షోలో ఉండేవిధంగా చూడాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవ కారణంగా నేడు నగరంలో అనేక అపార్టుమెంట్లు,. విల్లాస్లు, ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీలు వ్యాపారాలు చేస్తున్నాయి.
– ఆర్వీఎస్ సాగర్, టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి