భద్రాచలం, ఫిబ్రవరి 6 : గంజాయి కేసులో నేరం రుజువైన వ్యక్తికి 10ఏళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ కొత్తగూడెం ఒకటో అదనపు జిల్లా జడ్జి ఎం.శ్యాంశ్రీ సోమవారం తీర్పునిచ్చారు.
వివరాల్లోకెళ్తే.. 2022లో భద్రాచలం అటవీశాఖ చెక్పోస్టు వద్ద ఆబ్కారీశాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కామారెడ్డికి చెందిన కే దేవరాజ్ 150 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు. సాక్షులను విచారించి, వాదోపవాదాలు విన్న అదనపు న్యాయమూర్తి నిందితుడికి జైలు, జరిమానా విధించారు.